![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore//images/categories/movies.jpg)
వాస్తవానికి బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ తో పోటీ పడుతుంది అంటూ అనేక గాసిప్పులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు దక్షిణాది ప్రాంతానికి చెందిన తెలుగు తమిళ కన్నడ భాషలలొ కూడ ‘పుష్ప 2’ ను డబ్ చేసి అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తారు అని అంటున్నారు.
అయితే ఈ విషయాలను పట్టించికోకుండా శివరాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరతి రణగల్’ ఆగష్టు 15న విడుదల కాబోతోంది. ఈ మూవీ కన్నడంలో బ్లాక్ బష్టర్ హిట్ అయిన ‘మఫ్టీ’ కి కొనసాగింపు అని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనేకమంది నిర్మాతలు ప్రయతించినప్పటికీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు అని అంటారు.
గతంలో ‘పుష్ప’ విడుదల అవుతున్నప్పుడు ఆమూవీ క్రేజ్ ను లెక్కచేయకుండా అనేక బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు ప్రభాస్ నటించిన ‘సలార్’ మ్యానియాను లెక్కచేయకుండా గత డిసెంబర్ లో విడుదలైన మొహన్ లాల్ నటించిన ‘నేరు’ మళయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ తనకు రిపీట్ అవుతుందని కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ భావిస్తున్నాడనుకోవాలి..