
మన టాలీవుడ్ లో త్వరలో రిలీజ్ అయ్యే సినిమాలలో పలు సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమాలలో క్రేజీ సీక్వెల్స్ లో ఒకటి అయిన ఈ నగరానికి ఏమైంది 2 కూడా ఉంది. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా .. దర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలో తెరకెక్కిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సీక్వెల్ కి “ ఈఎన్ఈ రిపీట్ ” అంటూ పార్ట్ టూ ని రీసెంట్ గానే ఎనౌన్స్ చేశారు. అయితే లేటెస్ట్ గానే ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో వైరల్ అవుతుంది. ఈ నగరం వరల్డ్ లోకి డాకూ మహారాజ్ బాలయ్య ఎంటర్ కానున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ క్రేజీ సీక్వెల్ సినిమాలో నందమూరి నటసింహ బాలకృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ కామియో రోల్లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా కలిసి ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం కొన్ని నిమిషాల పాటు బాలయ్య తెరపై కనిపించి అలరిస్తాడని టాక్. ఇది నిజమైతే కచ్చితంగా ధియేటర్లలో బ్లాస్ట్ అని చెప్పాలి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక విశ్వక్సేన్ - బాలయ్య మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. బాలయ్య షోకు కూడా విశ్వక్సేన్ వచ్చారు. విశ్వక్ నటన , మాస్ స్టైల్ అంటే ఎంతో ఇష్టమని బాలయ్య కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు