సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది జనాలు.  మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే ఒక పేరు బాగా వినిపిస్తుంది . పాన్ ఇండియా హీరో కన్నా పాపులారిటీ సంపాదించుకునే రేంజ్ లోనే ఈ యాంకర్ పేరు మారుమ్రోగిపోతుంది. ఆయన మరెవరో కాదు నిఖిల్. యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ తో చాలా ఫేమస్ అయ్యాడు . యాంకర్ నిఖిల్ తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు . ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరికీ అయితే ఎక్కువ నెగిటివిటీ ఉంటుందో.. వారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి ఈ యాంకర్ ప్రశంసలు దక్కించుకుంటాడు .


విమర్శలు కూడా క్రియేట్ చేయగలడు అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . కాగా మెగా డాటర్ నిహారిక తో ఎక్కువగా చనువుగా ఉంటూ సోషల్ మీడియాలో నానా రకాలుగా టృఎండ్ అయిన ఈ యాంకర్ నిఖిల్ ..అనసూయ -సుప్రజ -సురేఖా లాంటి  వారిని ఇంటర్వ్యూ చేసి కంటెంట్ బాగా సంపాదించాడు . దీంతో నిఖిల్ పేరు ఎక్కువగా మారుమ్రోగిపోతూ ఉంటుంది . తాజాగా "ముద్దు ముచ్చట్లు" అనే పేరుతో ఒక షోని ప్రారంభించాడు నిఖిల్. ఈ షో కి బిగ్ బాస్ ఫేమ దేత్తడి హారిక - దీవిలను గెస్ట్ లుగా పిలిచాడు . రకరకాల ప్రశ్నలు అడిగారు.  చాలా సరదాగా మాట్లాడుకున్నారు . అయితే ఉన్నట్టుండి నిఖిల్ ఒక ప్రశ్న అడిగారు.

 

" ఎప్పుడైనా క్లాత్స్ లేకుండా ఫోటోలు తీసుకున్నారా ..?" అని ప్రశ్నించారు దీంతో ఒక్కసారిగా  హారిక - దివి షాక్ అయ్యారు.  ఏంటి ఈ ప్రశ్న..? అని మనసులో అనుకున్నారో ఏమో..?? బయటకు మాత్రం అనలేదు. ఆ తర్వాత మీకు ఎవరైనా ప్రైవేట్ ఫొటోస్ పంపారా..? అంటూ బోల్డ్ గా ప్రశ్నించాడు.  దీనికి "ఎస్" అంటూ సమాధానం ఇచ్చారు.  ఇక ఈ వీడియో పై జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు . అసలు బుద్ధుందా..? ఇద్దరు ఆడపిల్లలని అడగాల్సిన ప్రశ్న ఇది నా..? అని అంటుంటే మరికొందరు నీలాగే అందరు ఉంటారు అనుకున్నావా ..? అంటూ ఘాటు ఘాటుగా ఘాటైన పదాజాలంతో ట్రోల్ చేస్తున్నారు . ఇక ఇలాంటి క్వశ్చన్స్ కి వాళ్లు ఆన్సర్ ఇవ్వడం కూడా అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . ఇలాంటి మైండ్ సెట్ ఉన్న జనాలు కూడా ఉన్నారా ..?అంటూ తిడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది..!



మరింత సమాచారం తెలుసుకోండి: