నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం మీరాయ్. ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతోంది. హీరోగా తేజ సజ్జా , హీరోయిన్గా రితిక నాయక్ నటించారు. అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు, శ్రియ, రానా తదితరులు నటించారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రంలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ గురించి ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.


మీరాయ్ సినిమాని దాదాపుగా రూ .60 కోట్ల రూపాయలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించారు. ఈ సినిమాలో నటించిన హీరో తేజ సజ్జా కి రూ.2 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్స్ లో కూడా తేజ హనుమాన్ సినిమాకి ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నానని చెప్పారు. అయితే ఇతర సినిమాలకు మాత్రం రూ .15 కోట్లు తీసుకుంటున్నారట. మంచు మనోజ్ రూ.3  కోట్ల రూపాయలు. శ్రియా రూ.2 కోట్ల రూపాయలు, హీరోయిన్ రితిక నాయక్ రూ.50 లక్షల తీసుకున్నట్లు సమాచారం.



సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇందులో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు తేజ క్యారెక్టర్ ని ఇందులో చాలా భిన్నంగా చూపించారని ఒక యోధుడిగా, యాక్షన్ హీరోగా చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్లో ఉంటుందని అభిమానులు ఎంతో ఆశపడినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఇందులోని పాటను  తొలగించడానికి  గల కారణం ఈ సినిమాలో ఉండే కథను డిస్టర్బ్ చేస్తుందనే భావనతో చివరి నిమిషంలో ఈ పాటను తీసివేసినట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి పాజిటివ్ టాక్ సంపాదించిన మీరాయ్ మొదటిరోజు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: