గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎల్. మురుగన్ ఈ శుభవార్తను వెల్లడించారు. "సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్ గారిని, బాలకృష్ణ గారిని సన్మానించబోతున్నాం. వారిద్దరి సినీ ప్రయాణం భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. దశాబ్దాలుగా వారు చేసిన అద్భుతమైన కృషికి, వారి నిబద్ధతకు గుర్తింపుగా.. ఇఫి ముగింపు వేడుకల్లో వారిని గౌరవించుకోబోతున్నాం" అని ఆయన చెప్పుకొచ్చారు. సినీ రంగం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (ఇఫి) వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవా వేదికగా జరగనున్నాయి.
ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాలతో పాటు, భారతీయ సినిమా ఖ్యాతిని పెంచే ఈ మెగా వేదికపై.. రెండు రాష్ట్రాల మాస్ హీరోలు ఒకేసారి సన్మానం అందుకోబోతుండటం అభిమానులకు పండుగే!రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్తో దశాబ్దాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను ఏలుతుంటే.. నటసింహం బాలకృష్ణ తన పౌరుషం, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. కోట్లాది మంది అభిమానులు తమ దేవుళ్లుగా భావించే ఈ ఇద్దరు మహానటులకు, కేంద్ర ప్రభుత్వం తరఫున 'ఇఫి' లాంటి వేదికపై సన్మానం దక్కడం.. వారి సినీ చరిత్రకు దక్కిన అత్యున్నత సముచిత గౌరవం! నవంబర్ 28న జరిగే ముగింపు వేడుకల్లో ఈ ఇద్దరు దిగ్గజాలను సన్మానించే అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి