టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ చాలా సంవత్సరాల క్రితమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు రామ్ చరణ్ కూడా ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఓ వైపు చిరంజీవి , మరో వైపు చరణ్ ఇద్దరు కూడా అద్భుతమైన ఫామ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం చిక్రీ చిక్రీ అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు వెర్షన్ సాంగ్ కి ఇప్పటివరకు యూట్యూబ్లో 53 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి "మన శంకర వర ప్రసాద్ గారు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ నుండి కొన్ని రోజుల క్రితం మీసాల పిల్ల అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 60 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.  ఇలా పెద్ది మూవీ లోని  చిక్రీ చిక్రీ సాంగ్ తో పోలిస్తే మన శంకర వర ప్రసాద్ గారు మూవీలోని మీసాల పిల్ల సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సాంగ్స్ కి కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక పెద్ది సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: