ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య కొత్త సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే తెలిసినట్లుగా, నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న తాజా చిత్రం "అఖండ 2"  డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బాలయ్య ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. అభిమానుల్లో కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా విడుదలకు ముందు నిర్వహించనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి.
 

నవంబర్ 28వ తేదీన హైదరాబాదులో ఈ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కూడా ఈ ఈవెంట్‌కు వస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పేర్లు రావడంతో ప్రీ-రిలీజ్ వేడుకపై హైప్ మరింత పెరిగిపోయింది.



ఇదిలా ఉంటే, బాలయ్య తదుపరి చిత్రం గురించి కూడా కొత్త అప్డేట్లు వరుసగా బయటకు వస్తున్నాయి. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతారను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ గా శ్రీనిధి ని సెలక్ట్ చేసిన్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. అయితే, నయనతారను ఈ సినిమాలోకి తీసుకోవడం అంత సులభం కాలేదట. ఆమెను ఒప్పించే విషయంలో దర్శకుడు గోపీచంద్ మల్లినేని బాగా కష్టాలు పడ్డారట. ఆమె కండీషన్స్ చూసి డైరెక్టర్ భయపడిపోయారట. చివరకు బాలయ్య స్వయంగా రంగంలోకి దిగడంతో, ఆయన మాటకు గౌరవం ఇచ్చిన నయనతార ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒక్క ఫోన్ చేయడంతో పని అయ్యిందన్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బాలయ్య–గోపీచంద్–నయనతార కాంబినేషన్‌పై క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: