ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రామ్ చరణ్ గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఆయన పెద్ది సినిమా తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకోబోతున్నారు, అన్ని తదుపరి సినిమాలను హోల్డ్‌లో పెట్టేశారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఉపాసన ట్విన్స్ కి జన్మనివ్వబోతున్న నేపథ్యంలో, కుటుంబానికి సమయం ఇవ్వడానికి రామ్ చరణ్ అన్ని షూటింగ్స్‌ను రద్దు చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగింది.అయితే, మెగా కాంపౌండ్ వర్గాల నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా తెలిసింది. రామ్ చరణ్సినిమా షూటింగ్‌ను కూడా క్యాన్సిల్ చేయలేదని, కేవలం అవుట్‌డోర్ షెడ్యూల్స్‌ మాత్రమే మార్చి, మిగతా భాగాన్ని హైదరాబాద్‌లోనే షూట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పినట్టు తెలుస్తోంది. అంటే… షూటింగ్స్ ఆగలేదు, కేవలం పద్ధతి మార్చారు అంతే.


అయినా సోషల్ మీడియాలో మాత్రం “రామ్ చరణ్ బ్రేక్ తీసుకుంటున్నారు”, “ సినిమాలు వాయిదా” వంటి న్యూస్‌లు అలాగే వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ నిజానికి ఇవన్నీ అవాస్తవ ప్రచారాలు అని మెగా కాంపౌండ్ నుండి ఓ న్యూస్ బయటకి వచ్చింది.ఇక రామ్ చరణ్ తదుపరి సినిమా విషయానికొస్తే– ఆయన త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. ఇది రంగస్థలం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే రెండో చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిని అభిమానులు ఇప్పటికే “రంగస్థలం 2”గా పిలుస్తూ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.



ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోబోతున్నారు అన్న ప్రశ్న నెలల నుంచి చర్చలో ఉన్నప్పటికీ, తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కృతి సనన్ ని ఫైనలైజ్ చేశారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటనే ఇంకా రావాల్సి ఉంది.మొత్తానికి—రామ్ చరణ్‌కి సంబంధించిన వైరల్ వార్తల్లో నిజం ఏమీ లేదు. ఆయన షూటింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలోనే సుకుమార్‌తో మరో పాన్ ఇండియా స్థాయి సినిమా మొదలయ్యే అవకాశం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: