బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ - జాన్వీ కపూర్ కాంబోలో రాబోతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.రామ్ చరణ్ తన 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్లు మరియు వ్యక్తిగత కారణాల వల్ల కొంచెం బిజీగా ఉండటంతో 'పెద్ది' షూటింగ్ అనుకున్న సమయం కంటే వెనకబడిందట. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేయాల్సిన భారీ సెట్టింగ్ల పనులు ఇంకా పూర్తి కాకపోవడమే ఈ లేట్ కి ప్రధాన కారణం అని తెలుస్తోంది."
'ఉప్పెన'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు, ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోతెరకెక్కిస్తున్నారు.షూటింగ్ లేట్ అయినా పర్లేదు కానీ అవుట్పుట్ మాత్రం పక్కాగా రావాలని ఆయన పట్టుబడుతున్నారు.ఇందులో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా, చాలా సహజమైన లుక్ లో కనిపిస్తుందట. ఈ పాత్ర కోసం జాన్వీ కూడా తన బాడీ లాంగ్వేజ్ను మారుచుకుంటోంది.రామ్ చరణ్ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. షూటింగ్ వాయిదా పడుతోందన్న వార్త మెగా ఫ్యాన్స్ను కాస్త నిరాశకు గురిచేసినా, సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో అందరూ వెయిట్ చేస్తున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ప్లస్ పాయింట్. సాంగ్స్ రికార్డింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
ఒకవైపు జాన్వీ తన గ్లామర్ తో సినిమాపై హైప్ పెంచుతుంటే, మరోవైపు టెక్నికల్ పనులు సాగుతున్నాయి. షూటింగ్ ఆలస్యమవ్వడం వల్ల రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.మొత్తానికి జాన్వీ కపూర్ తన హాట్ సెల్ఫీలతో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంటే, 'పెద్ది' టీమ్ మాత్రం షూటింగ్ కష్టాల్లో ఉంది. లేట్ అయినా సరే, బాక్సాఫీస్ దగ్గర చరణ్ - జాన్వీ జోడి ఒక హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. ఆ గ్లామర్, ఆ యాక్షన్ ఒకేసారి స్క్రీన్ పై చూడాలంటే మెగా ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడక తప్పదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి