గత కొద్ది రోజులుగా సిని ఇండస్ట్రీలలో ఎక్కువగా పొలిటికల్ విషయాలే వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హవా ఎక్కువగా కనిపిస్తోంది. తమిళనాడులో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విజయ్ దళపతి సీఎం అయినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలామంది సెలబ్రిటీలు పొలిటికల్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను కూడా సింగల్ గా పోటీ చేయమని జనసేన నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాదిరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అటు విజయ్, ఎన్టీఆర్ పొలిటికల్స్ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


దివ్వెల మాదిరి మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకి చాలా ఇష్టమని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆరే  మళ్లీ అంతటి ఇష్టం అయినా ఆయన సినిమా అంటే మొదటి రోజే చూస్తాను ఆయన బర్త్డే రోజు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తానని, జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఆయన పార్టీలోకి చేరిపోతాం అంటూ తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టే ఛరష్మా , సామర్థ్యం కలిగిన వారిని, ఆయన పార్టీ పెడితే కచ్చితంగా సీఎం అవుతారని, ఒకవేళ సీఎం అయితే ఎన్టీఆర్ సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తారని తెలియజేసింది.


దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఆయన ఉండే పద్ధతి చాలా బాగుంటుంది. పార్టీ పెట్టగలిగే సమర్ధత ఆయనకు ఉంది చాలా మాట్లాడగలరు, పబ్లిక్ లో కూడా ఆయన మాట్లాడితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ కలిగి ఉంది. విజయ్ గారు 12 ఏళ్లుగా పలు రకాల కార్యక్రమాలు చేస్తూ పార్టీ పెట్టి ఇప్పుడు గెలిచారు. ఆయన అభిమానులను చాలా తెలివిగాని పొలిటికల్ గా టర్న్ చేసుకోగలిగారు, విజయ్ సీఎం అవడం పెద్ద విశేషమేమీ కాదు, ఎంజీఆర్ దగ్గర నుంచి ఇప్పటివరకు చాలామంది సినీ నటులే అక్కడ పరిపాలించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కానీ టిడిపి పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రచారం చేశారు. పార్టీ కోసం చాలానే కష్టపడ్డారు కానీ ఇప్పుడు పట్టించుకోలేదంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: