లై , చల్
మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం రూపంలో వరుసగా హ్యాట్రిక్ పరాజయాల ను చవిచూసిన యంగ్ హీరో
నితిన్ కొంచెం గ్యాప్ తీసుకొని ఇటీవల మూడు సినిమాలకు సైన్ చేశాడు. వాటిలో ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న 'భీష్మ' ఒకటి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం మూడవ షెడ్యూల్ జరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలచేయనున్నామని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం
క్రిస్మస్ బరి నుండి తప్పుకుందని తెలుస్తుంది. నితిన్ ప్రస్తుతం ఈ చిత్రం తోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తుండడం తో భీష్మ షూటింగ్ ముందుగా అనుకున్న డేట్ కి పూర్తి కావడం లేదట. దాంతో ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్బంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదలచేయనున్నారట.
త్వరలోనే ఈ విడుదలతేదీ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. ఈ చిత్రంలో కన్నడ
బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తుండగా ఛలో ఫేమ్
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక మాస్ మహారాజ్
రవితేజ నటిస్తున్న డిస్కోరాజా కూడా ఫిబ్రవరికి వాయిదాపడిందని వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ నుండి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ప్రస్తుతానికైతే సాయి తేజ్ నటిస్తున్న ప్రతిరోజు పండగే ఒక్కటే
క్రిస్మస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకానుంది. ఈచిత్రం తో పాటు బాలకృష్ణ నటిస్తున్న రూలర్ కూడా అదే సమయంలో విడుదలకానుందని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు మేకర్స్ ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.