అక్కినేని అఖిల్ కు అనుకోకుండా ఒక దాని వెంట మరోకష్టాలు వెంటాడుతూ వచ్చి అఖిల్ ను అయోమయంలో పడేస్తునే ఉన్నాయి. నాగార్జున అఖిల్ తొలి సినిమాను భారీగా ప్లాన్ చేసి నితిన్ చేత భారీగా నిర్మింప చేసి విడుదల చేసినా ఆ సినిమా బుడగలా పేలిపోయింది.
దీనితో ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాగార్జున కుటుంబానికి కొన్ని నెలలు పట్టింది. దీనితో మొదటి సినిమాలో చేసిన తప్పును మరోసారి చేయకుండా అఖిల్ అతడి తండ్రి నాగ్ సరైన సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందుగా కళ్యాణ్ కృష్ణ అనుకున్నారు కానీ అది కుదరలేదు ఆ తరువాత సంపత్ నంది, సుకుమార్ ఇలా ఎన్నో పేర్లు బయటకు వచ్చి చివరికి నాగార్జున వంశీ పైడి పల్లిని అధికారికంగా ప్రకటించడంతో అఖిల్ రెండవ సినిమాకు దర్శకుడు ఎవరు అన్న విషయానికి తెరపడింది అని అనుకున్నారు అంతా.
అయితే ఇప్పుడు ఆ సినిమా డ్రాప్ అయిందని ఫిలిం నగర్ లో హడావిడి మొదలు అయింది. దీనికి కారణం ఈ సినిమాను మైత్రి మూవీస్ అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిపి నిర్మించడానికి ముందుకు వచ్చిన నేపధ్యంలో అఖిల్ వంశీ పైడిపల్లి అఖిల్ కోసం రెడీ చేస్తున్న సబ్జెక్ట్ కు సుమారు 40 కోట్లు అవసరం అవుతాయని టాక్. దీనితో అఖిల్ మీద 40 కోట్ల బడ్జెట్ అనేసరికి మైత్రి మూవీస్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.
అఖిల్ కు వున్న మార్కెట్ ప్రకారం 25 కోట్లు అయితే ఫరవాలేదు కాని అంతకు మించి అయితే రిస్క్ అని మైత్రి మూవీస్ భావిస్తూ ఉండటంతో ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ బ్యానర్ పై అఖిల్ రెండవ సినిమాను తీయడం ఎంత వరకు సేఫ్ అని స్వయంగా నాగార్జున ఆలోచనలో పడటంతో అఖిల్ రెండవ సినిమా ప్రారంభం కాకుండానే అటకెక్కుతుందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. .