తెలుగు ఇండస్ట్రీలో విలక్షన నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా రాణించాలన్న ఆమె కలలు మాత్రం నెరవేరడం లేదు. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెరపై యంకర్ గా మాత్రం మంచి పేరు తెచ్చుకుంది మంచు లక్ష్మింది. ఇప్పుడు మంచు లక్ష్మి ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందట..ఎందుకూ ఆమెకు ఏదైనా జాక్ పాట్ తగిలిందా..అనుకుంటే పొరపాటే..! గత కొంత కాలంగా ఆమెను ఎంతగానో వేధిస్తున్న ప్రశ్న బాహుబలి ఫస్ట్ పార్ట్ లో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’..అయితే ఈ ప్రశ్నకు ఆమెకు సమాధానం దొరికిందట.
'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సినీ అభిమానులను అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాను ఆరాధించే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న రహస్యం తెలిసిపోయిందంటూ సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాహుబలి 2 సినిమాని చూసిన మంచు లక్ష్మి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తన సహనటులతో కలిసి మొదటి రోజు మొదటి ఆట బాహుబలి-2 చూశానని చెప్పి, ట్విట్టర్లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సుశాంత్ తదితరులు ఉన్నారు. మొత్తానికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయిందని మంచు లక్ష్మి తెగ సంబర పడి పోతుంది.
మంచు లక్ష్మి ట్విట్ :