తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు తమ ఆరాద్య దేవంగా కొలిచే హీరో ఎవరూ అంటే వెంటనే గుర్తుకు వస్తారు..సూపర్ స్టార్ రజినీకాంత్. ఎంజీఆర్ తర్వాత అంత గొప్ప మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు రజినీకాంత్. తెలుగు, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న రజినీ ఆ మద్య రోబో చిత్రంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ చిత్రం తెరకెక్కించిన స్టార్ ప్రొడ్యూసర్ శంకర్ ప్రస్తుతం రజినీకాంత్ తో రోబో 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి చేసుకుంటుందని సమాచారం. అయితే రోబో 2.0 ఆడియో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట. ఇప్పటి వరకూ లేని భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో ఏకంగా రూ.400 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. ఆడియో వేడుకను భారీ ఖర్చు చేయాలని నిర్ణయించారట.
'ఐ' సినిమాకు ఇలా కళ్లు చెదిరేలా ఆడియో వేడుకను చేసి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు '2.0' కోసం అంతమించి ఖర్చు చేస్తున్నారట. దుబారులో ఆడియో లాంచ్కు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఏకంగా రూ.25 కోట్ల బడ్జెట్ను నిర్ణయించారట. పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా 2.0 ఆడియో వేడుకలో సందడి చేసే అవకాశం ఉంది.
రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ తో రూపొందుతున్న రోబో సీక్వల్ 2.0ను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.