సైరా నరసింహారెడ్డి సినిమాకు ఏమైంది..? ఎందుకు అవాంతరాలు ఎదురవుతున్నాయి..? రెహమాన్ ప్లేస్ లో కీరవాణి.., ఆ తర్వాత తమన్ చేరాడు.. ఇప్పుడు డైరెక్టర్ కూడా మారుతున్నాడనేది టాక్.. అంతేకాదు.. నయనతార కూడా హ్యాండివ్వబోతోందనే రూమర్స్ వస్తున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతున్నాయి..?

Image result for syeraa narasimha reddy

సైరా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డిని మార్చి ఆ స్థానంలో గుణశేఖర్ ని తీసుకోబోతున్నారనే టాక్ వస్తోంది. నిర్మాత రామ్ చరణ్.. చిరంజీవికి బంపర్ హిట్ ఇచ్చిన చూడాలనిఉంది సినిమా డైరెక్టర్ గుణశేఖర్ ని తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనేది టాలీవుడ్ టాక్. సురేందర్ రెడ్డి పనితీరుపై చిరంజీవి అసంతృప్తిగా ఉండడమే కారణమేనిది సమాచారం.

Image result for surendar reddy and gunasekhar

సై..రా నరసింహారెడ్డి స్క్రిప్ట్ ను పక్కాగా రూపొందించాడు సురేందర్ రెడ్డి. ఆ స్క్రిప్ట్ చూశాకే చిరంజీవి సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా పట్టాలెక్కి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో సురేందర్ రెడ్డి పనితీరును చూసిన చిరంజీవి.. ఏమాత్రం హ్యాపీగా లేరనేది టాలీవుడ్ టాక్. అందుకే వెంటనే గుణశేఖర్ ని రీప్లేస్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Image result for syeraa narasimha reddy

టెక్నికల్ గా సురేందర్ రెడ్డి సత్తా ఏంటో అందరికీ తెలుసు. సినిమాను స్టైలిష్ గా రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ చిరంజీవి మాత్రం సురేందర్ రెడ్డపై అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క సురేందర్ రెడ్డి విషయంలోనే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ రెహమాన్ ను తీసుకున్నారు. తర్వాత కీరవాణిని రీప్లేస్ చేశారు. లేటెస్ట్ గా తమన్ కు అవకాశం కల్పించారు. మరోవైపు నయనతార డేట్స్ కూడా ఇంకా ఫిక్స్ అవలేదని సమాచారం. దీంతో ఆమె కూడా డ్రాప్ అయినట్లేనని టాలీవుడ్ వీధుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: