తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత మహేష్ బాబు రెండు చిత్రాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. దాంతో మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చిత్రం మరో ఘన విజయం సాధించింది. అంతే కాదు మహేష్ బాబు కెరీర్ లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం మరో విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు ప్రముఖ దర్శకులు, నిర్మాత పైడిపల్లి వంశి దర్శకత్వంలో నటిస్తున్నారు. మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపుద్దికుంటోన్న కొత్త సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ లో కొనసాగుతుంది.
ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్కడ మొదలైపోయింది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.మహేశ్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనుండగా, ఆయన సరసన కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. దిల్ రాజు .. అశ్వనీదత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. తాజాగా మహేశ్ బాబు కొత్త సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. ఆ సినిమా షూటింగ్ జరుగుతోన్న ప్రదేశానికి వచ్చి మహేశ్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో మహేశ్ బాబు టోపీ పెట్టుకుని మీసాలు, గెడ్డంతో కనపడుతున్నాడు. ఇదిలా ఉంటే.. 'ఎన్టీఆర్' బయోపిక్ తో బాలకృష్ణ .. బోయపాటి సినిమాతో చరణ్ సంక్రాంతి బరిలో దిగడం ఖాయమైపోయింది. అదే సమయానికి మహేశ్ బాబు సినిమా కూడా రంగంలోకి దిగుతుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.