చెట్లు లేక ఒక్క హిట్ కోసం విల విల లాడుతున్న ఐరన్ లెగ్ హీరోయిన్ ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఉండి ఎట్టకేలకు ఇటీవల హిట్ కొట్టిన మెగా హీరోను పట్టేసింది. ఒకప్పుడు రాశీఖన్నా పేరు చెప్తే తెలుగులో ఐరెన్ లెగ్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది. వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసి వరుస డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇచ్చింది. ముద్దుగా బొద్దుగా ఉంటుంది కదా ? అని చాలా మంది హీరోలు ఆమెతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. ఈ సినిమాల్లో చాలా సినిమాలు ఫట్ అయ్యాయి.
రాశీకి తెలుగులో ముందు వరుస ప్లాపులు వచ్చినా తర్వాత ఒకటి రెండు హిట్స్ పడ్డాయి. తిరిగి మళ్ళీ ఆమె సినిమాలని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి. ఇక వరుస ఫ్లాపుల తర్వాత సాయి తేజ్ ఎట్టకేలకు చిత్రలహరి సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. సాయి రేంజ్ మార్కెట్లో కాకపోయినా ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సాయి తేజ్- రాశిఖన్నా హీరోయిన్ గా కొత్త సినిమా స్టార్ట్ అయింది. హిట్లు లేక, ఛాన్సులు లేక ఉన్న రాశీ మొత్తానికి మెగా హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసింది.
గీతాఆర్ట్స్ 2 - యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే గతంలో సుప్రీమ్ సినిమాలో నటించిన సాయితేజ - రాశీఖన్నా ఆ సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్న వీరు ముగ్గురు మరోసారి జోడీ కడుతున్నారు. చిత్రలహరి రూపంలో సాయికి యావరేజ్ ఉన్నా అది సాయి మార్కెట్ కు తగ్గ సినిమా అయితే కాదు. మరోవైపు మారుతి కూడా సరైన హిట్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ముగ్గురికి సూపర్ హిట్ తప్పనిసరి. మరి ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వీరి కెరీర్ను ఎలా టర్న్ చేస్తుందో ? చూడాలి.