సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే పేరు అమలాపాల్. ఈ మధ్యే రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది. ఈమె నటించిన ఆడై సినిమా ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలకు ముందే భారీ బిజినెస్ కూడా చేస్తుంది. ఇందులో నగ్నంగా నటించి సంచలనం రేపింది అమలాపాల్. ఆమె పేరుతో ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజైంది.
ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈమె చేసిన ఒక్క ట్వీట్ ఆసక్తి పుట్టిస్తుంది. కావాలనే తన మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ను టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.ఇందులో ఎక్కడా విజయ్ పేరు లేకపోయినా కూడా చూసిన వాళ్లకు మాత్రం అది ఆయన్ని టార్గెట్ చేయడానికే అని అర్థమైపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే విజయ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మాయిని.. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసాడు కూడా.
ఈ విషయంపై అమలాపాల్ స్పందించలేదు.ఇక ఇప్పుడు ఈమె చేసిన ట్వీట్ మాత్రం కొత్త ప్రశ్నలకు తావిస్తుంది.చివరి వరకు తాను పోరాడతాననని.. కష్టాలు, సమస్యలు వచ్చాయని భయపడేది లేదు.. వచ్చినా పర్లేదు.. వాటిపై కచ్చితంగా గెలిచి ఎదుగుతానంటూ రాసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా ఎదురయ్యే సమస్యలకు ఎదురు నిలిచి.. వాటిని తరిమి బలాన్ని చూపిస్తానంటూ ట్వీట్ చేసింది. ధైర్యం ఉంటే ఓటమి రాదు.. స్వేచ్ఛ, సంతోషమే జీవితంలో ముఖ్యమంటూ వేదాంతం చెప్పింది ఈ బ్యూటీ
చివర్లో తాను నటిస్తున్న ఆమె సినిమా కథ ఇదేనంటూ ట్విస్ట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ముందు చెప్పిన మాటలన్నీ ఏఎల్ విజయ్ను ఉద్దేశించి అన్నవే అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటుంటే అమలాపాల్ మాత్రం అది తన సినిమాకు సంబంధించిందే అంటూ కవర్ చేసుకుంటుంది. మొత్తానికి ఏదేమైనా కూడా అమలాపాల్ మాత్రం ఎప్పుడూ ఏదో ఓ విషయంతో ట్రెండింగ్లోనే కనిపిస్తుంది.