వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ యువ సామ్రాట్ నాగ చైతన్య ఎట్టకేలకు మజిలీ తో సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం నాగ చైతన్య , విక్టరీ వెంకటేశ్ తో కలిసి 'వెంకీ మామ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. గత కొద్దీ నెలల నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. నవంబర్ లో ఈ సినిమా ను ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జై లవ కుశ ఫేమ్ బాబీ దర్శకుడు.
ఇక ఈసినిమా కాకుండా ఇటీవల శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగ చైతన్య . ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుండగా సెప్టెంబర్ 5నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం. ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో డ్యాన్స్ బేస్డ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చైతన్య , సాయి పల్లవి లోకల్ స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నారు. కాగాసాయి పల్లవి ఇంతకుముందు ఫిదా లో కూడా తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పగా నాగ చైతన్య మొదటి సారి ఈ స్లాంగ్ ను ట్రై చేస్తున్నాడు.
నారాయణ దాస్ నారంగ్ , రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలకానుంది. ఏఆర్ రహెమాన్ శిష్యుడు పవన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం. ఇక రేర్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.