ఇండియాలో ఒక మతాన్ని మరొక మతం వారు కించపరుస్తూ మాట్లాడేవారు ఎక్కువైపోయారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో ఇలా ఇతర మతం కి సంబంధించిన దేవుళ్లను కించపరుస్తూ పాపులారిటీ సంపాదించుకోవాలని నీచ బుద్ధితో ఆలోచిస్తున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. అయితే ఇలా దైవదూషణ చేసిన వారిపై కొన్ని కొన్ని సార్లు దాడులు జరుగుతూ ఉంటే.. ఇంకొన్నిసార్లు మాత్రం అటు పోలీసులు అరెస్టు చేసి మళ్లీ వదిలేయడం లాంటివి చేస్తూ ఉన్నారు.


 ఇలా దైవ దూసిన చేసిన వారికి న్యాయస్థానాలు మాత్రం సరైన శిక్ష వేయడం లేదు ఇండియాలో అని చెప్పాలి. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఇటీవల దైవ దూషణ చేసినందుకుగాను ఒక వ్యక్తికి ఆ దేశ కోర్టు విధించిన శిక్ష కాస్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.  దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు దూషణకు పాల్పడ్డాడు అనే ఆరోపణలతో ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.



 ఈ ఘటన పాకిస్తాన్లోని లాహోర్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. లాహోర్ కు 400 కిలోమీటర్ల దూరంలోని బహావల్ పూర్ లో ఇస్లాం కాలనీకు చెందిన 19 ఏళ్ల నౌమన్ మసేహ అనే యువకుడు దైవాన్ని దూషిస్తూ ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు కొన్ని కామెంట్లు కూడా చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అతనిపై కేసు నమోదు చేశారు అక్కడి అధికారులు.. ఇక వాట్సాప్ ద్వారా అతడు పంపించిన మెసేజ్లను వీడియోలను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టారు . ఇక ఇదే విషయంపై విచారణ జరిపిన బహవల్పూర్ న్యాయస్థానం నిందితుడి పై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో మరణశిక్షతోపాటు 20000 జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: