ఇక్కడ ఇలాంటి తరహా విషాద కర ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇటీవల ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికం గా కలకలం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరం లోని మియాపూర్ లో చోటు చేసుకుంది. మొబైల్ విషయం లో పక్కింటి స్నేహితురాలితో గొడవ ఏర్ప డగా సెల్ఫోన్ వివాదం కాస్త ఆ బాలిక ప్రాణాలు పోవడానికి కారణం గా మారిపోయింది. పక్కింటి స్నేహితురాలి తో గొడవ జరిగింది అన్న విషయం ఎక్కడ తల్లికి తెలుస్తుందో అన్న భయంతో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.
అనిత అనే బాలిక మధ్యాహ్న సమయంలో పక్కనే ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. ఇక్కడ సెల్ఫోన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా మళ్లీ కోపం తో ఇంటికి వచ్చేసింది అనిత. అయితే ఇక స్నేహితురాలితో గొడవ పడిన విషయం తన తల్లికి తెలిసి ఎక్కడ తిడుతుందో అనే భయం అనితను వెంటాడింది. ఈ క్రమంలోనే తల్లి లేని సమయం చూసి ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.