ప గో జిల్లా లో పలువురు టీడీపీ పార్టీ నేతలు హౌస్ అరెస్ట్ లు అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వరుసగా తెలుగు దేశం పార్టీ నేతలను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే తెలుగు దేశం పార్టీ నేతలను అరెస్ట్ చేయడం పై టిడిపి రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో టీడీపీ పార్టీ  కార్యాలయాలు , పార్టీ నాయకుల పై దాడులు ద్వారా  అంతర యుద్ధం  జరగాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి  కోరుకున్నాడని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు  జవహర్.  తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని,, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా శాం తి యుతం గా బందుకు టిడిపి పిలుపు నిస్తే పెద్ద ఎత్తున పోలీసులతో హౌస్ అరెస్ట్లు చేసి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు జవహర్.


ప్రజా స్వామ్యం లో ఈరోజు జరిగిన దాడిని అందరూ ఖండించాలని కోరారు జవహర్... పోలీసులను అడ్డుపెట్టు కొని జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం పిరికిపంది చర్య లు చేస్తుందని నిప్పులు చెరిగారు జవహర్.  వైసిపి నాయకులు కి మందు పోయించి టిడిపి కార్యాలయలు నాయకుల పై దాడి చేయించారని ఆగ్రహం వీఆఖతం చేశారు జవహర్...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలన కు తగిన బుద్ధి చెప్పే కాలం కూడా తరుముకొస్తోందనీ ఫైర్ అయ్యారు జవహర్. కాగా నిన్నటి రోజున.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసిపి నేతలు దాడి చేసిన సంగతి మనందరికీ విధితమే.

ముఖ్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ఇంటిపై కూడా దాడి చేశారు వైసిపి పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. వైసీపీ శ్రేణుల దాడి లో తీవ్రంగా గాయాలపాలైన వారిని పరామర్శించారు నారా చంద్రబాబు నాయుడు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ లో టిడిపి కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వయంగా పాల్గొనాలని... చాలా శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: