తెలంగాణ సర్కార్ పై ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రభుత్వాన్ని కూల గొట్టాలని ప్రయత్నాలు చేసినా కూడా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తుంది..ఈ మేరకు రైతు బంధు పథకాన్ని అందుబాటులోకి తీసుకోని వచ్చింది.. దాని ద్వారా ఇప్పటికే డబ్బులను జమ చేసింది.తాజాగా మరో గుడ్ న్యూస్ ను రైతులకు ప్రభుత్వం చెప్పింది.తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. యాసంగికి డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం అందించనున్నారు. ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నారు.


పంట పెట్టుబడికి రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ.5000 చొప్పున పంట సాయం అందిస్తోంది. ప్రస్తుతం యాసంగి పంట కాలానికిగానూ 7,600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు సాయాన్ని అందిస్తోంది. ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది.

రైతు బంధు గురించి ఎలా తెలుసుకోవాలో తెలుసా..

ముందుగా అధికారిక వెబ్‌సైట్

http://rythubandhu.telangana.gov.in/ వెబ్ సైట్‌కి వెళ్లండి
హోం పేజీలో రైతు బంధు స్కీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ (Cheque Distribution Venue Schedule) మీద క్లిక్ చేయాలి
ఆ తరువాతి పేజీలో మీ జిల్లా, మండలం సెలక్ట్ చేసుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది
అర్హుల జాబితాలో మీ పేరు ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది..

ఒకవేళ డబ్బులు రాకుంటే..

అధికారిక వెబ్ సైట్ https://treasury.telangana.gov.in/ కు వెళ్లండి
హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి
అనంతరం రైతు బంధు అందుకునే సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి
స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాలి
వివరాలు మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.
అయితే నేడు రైతులకు నగదు ప్రారంభించారు కనుక మరికొన్ని రోజుల్లో అధికారులు ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: