పాపం ఎల్లో బ్యాచ్ బాధ వర్ణనాతీతం. గుండెలు పగిలేలా ఏడుస్తుంటారు. ఎందుకంటే విశాఖపట్నంలో శుక్రవారం మొదలైన రెండురోజుల గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయినందుకు. సమ్మిట్ ఫెయిలవ్వాలని, జగన్మోహన్ రెడ్డికి మంచిపేరు రాకూడదని ఎల్లోమీడియా ఏడుపు అంతా ఇంతా కాదు. దాదాపు పదిరోజుల నుండి వరుసబెట్టి నెగిటివ్ స్టోరీలు కుమ్మింది కుమ్మిందే. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు సదస్సు సక్సెస్ కాదని పదే పదే చెప్పారు. శుక్రవారం కూడా వీళ్ళ ఏడుపు ఓ రేంజిలో సాగింది. 





వీళ్ళందరి ఏడుపులే ఆశీస్సులుగా మొదటిరోజు సదస్సు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఎంతలా అంటే మొదటిరోజే రు. 13 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదిరేంతగా. రెండోరోజు మరో రు. 10 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదరచ్చని అంచనా వేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ఎంవోయులు కుదుర్చుకోవటమే కాకుండా అవన్నీ వాస్తవరూపంలోకి వచ్చేట్లుగా జగన్ ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.





ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ ముఖేష్  అంబానీ హైలైట్ గా నిలిచారు. ఇప్పటికే దక్షిణాదిలో జరిగిన ఏ సదస్సుకు ముఖేష్ హాజరుకాలేదట. అలాంటిది ఇపుడు వైజాగ్ రావటమే కాకుండా జగన్ను చూడగానే ముఖేష్ గట్టిగా హత్తుకున్నారు. స్పెషల్ ఫ్లైట్లో విశాఖ వచ్చిన దగ్గర నుండి జగన్ను ముఖేష్ ఒక్కనిముషం కూడా వదలలేదు.





మిగిలిన పారిశ్రామికవేత్తలు కూడా జగన్ను వరసబెట్టి అభినందించారు. చాలామంది పారిశ్రామిక దిగ్గజాలు జగన్ను వదిలిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. సదస్సులో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు వేలకోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించారు. ఇదంతా చూసిన తర్వాత ఎల్లోబ్యాచ్ కు ఇక ఏడుపు ఆగుండదనటంలో అతిశయోక్తిలేదు. ఏదైతే జరగకూడదని మొత్తం ఎల్లోబ్యాచ్ అనుకుంటున్నదో దానికి విరుద్ధంగా జరిగింది. ఎల్లోబ్యాచ్ ఏడుస్తున్నదంటేనే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు సూపర్ సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఇక మిగిలింది ఏమిటంటే లక్షల కోట్ల రూపాయల వివులైన ఎంవోయులు వాస్తవరూపంలోకి రావటమే.

మరింత సమాచారం తెలుసుకోండి: