తెలంగాణలో బలపడేందుకు తెగ ట్రై చేస్తోంది బీజేపీ. అసోం తరహాలో పాగా వేస్తామని చెబుతున్నారు రాష్ట్ర నేతలు. మరి ఆస్ధాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తోందా.. ? ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందా ..? అంటే అలాంటిదేమి లేదనే చెప్పాలి. సమస్యలను పట్టించుకోకుండా ... హైదరాబాద్లో కూర్చొని సమావేశాలు పెడితే ఎలా అంటూ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఆశ బారేడు, చేసే పోరాటాలు మాత్రం మూరెడులా తమ పార్టీ పరిస్థితి మారిదంటున్నారు పార్టీ కేడర్..