థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ప్రసారం చేయాల్సిందే, ఆ సమయంలో అంతా లేచి నిలబడి జాతీయ జెండాను గౌరవించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. జాతీయగీతం జనగణమనను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జాతీయ గీతాలాపనపై ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆలపించాలో మార్గనిర్దేశకాలు జారీచేసింది. సుప్రీం తీర్పును దేశవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామంది కేంద్రప్రభుత్వం.