జయలలిత మృతి తర్వాత తమిళనాడు ని ఎవరు శాసిస్తారు ఎవరు పాలిస్తారు ? ఆమె లాగా ఆ రాష్ట్రాన్ని ఎవరు అక్కున చేర్చుకుంటారు అనే చర్చ వాడి వేడిగా జరుగుతోంది. కానీ ఆమె బతికున్న రోజుల్లో కన్న అతిపెద్ద కల గురించి మాత్రం మనలో ఎవ్వరికీ పెద్దగా తెలీదేమో. జయలలిత కి ప్రధానమంత్రి కావాలి అనే ఒకే ఒక్క బలమైన కోరిక మాత్రం తీరకుండానే ఆమె చనిపోయారు. రాజకీయాలలో ఎవ్వరూ పడని ఆటుపోట్ల ని తట్టుకుని ఆమె నిలదొక్కుకుని ముఖ్యమంత్రి స్థానాన్ని ఆరుసార్లు ఎక్కేసారు.