తెలంగాణ కాంగ్రెస్
పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్లో రోడ్ నంబర్ 45 సిగ్నల్ దగ్గర ఆగివున్న ఆయన కారు మీదకు
సినిమా షూటింగ్ వాహనం దూసుకొచ్చింది. దీంతో పొన్నాల కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.
ప్రమాద సమయంలో పొన్నాల లక్ష్మయ్య మనవడు కూడా ఆయనతో పాటు అక్కడే ఉన్నారు. ప్రమాదం తప్పడంతో పొన్నాల లక్ష్మయ్య, ఆయన మనవడు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన ఈరోజు రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పొన్నాల లక్ష్మయ్య అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయనకు ఎలాంటి ఘటనా జరగలేదు అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ సినిమా వ్యాను యాంకర్ ఓంకార్ ది అని కొందరు ప్రముఖులు చెవుతున్నారు. అయితే ఈ ఘటన బాలకృష్ణ ఇంటికి దగ్గరలోనే జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఏది ఏమైనా పొన్నెల తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.