ఈ మధ్యకాలంలో ప్రేమలు బాగా ఎక్కువైపోయాయి. ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమించడం.. ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే బెదిరించడం... ఆ తర్వాత బలవంతంగా తాళి కట్టడం. ఇలాంటివి ఈ రోజుల్లో తరచు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. బస్సు కోసం ఎదురు చూస్తున్న యువతిని కిడ్నాప్ చేసి మరీ తాళికట్టాడు ఇక్కడో ఒక ప్రబుద్ధుడు. వరుసకు మరదలు అయ్యే యువతిని పెళ్లి చేసుకోవాలంటూ ఏడాదిగా అడుగుతున్న  ఆ యువతి ఒప్పుకోకపోవడంతో చివరికి... ఇలా కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా తాళి కట్టాడు. కానీ చివరికి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. 

 

 

 23 ఏళ్ల బాధిత యువతి బస్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో... కొందరు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. ఇక అందరూ చూస్తుండగానే ఆ యువతిని అతడు బలవంతంగా కారులోకి ఎక్కించారు.అనంతరం యువతికి బావ వరుసయ్యే  మను అనే యువకుడు ఆమె మెడలో తాళి కట్టాడు. అయితే తనను పెళ్లి చేసుకోవడానికి ఆ యువతి నిరాకరించిందని కోపంతోనే ఆ యువకుడు ఈ దారుణానానికి  ఒడిగట్టాడు. తనను  వదిలేయాలని బాధిత యువతి ఎంత బతిమిలాడినప్పటికి కూడా... కారులో కిడ్నాప్ చేసి తరలిస్తున్న సమయంలోనే ఆ యువకుడు ఆమె మెడలో తాళి కట్టాడు మను . అనంతరం ఆమెను స్నేహితుడు ఇంటివద్ద దాచిపెట్టాడు ఆ యువకుడు. 

 

 

 ఇక కూతురు కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా ఆ యువతి బావ దగ్గర ఉంది అని గుర్తించి ఆమెను వారి చర నుండి  కాపాడారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ బావ వరుసయ్యే  మను ఏడాదిపాటు గా ఆ యువతి వెంటపడుతున్నాడు. కానీ ఆ యువతి మాత్రం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ చెబుతూనే ఉంది. ఎలాగైనా ఆ యువతిని దక్కించుకోవాలని ఆలోచించిన యువకుడు... బాధితురాలను హసాన్  డైరీ సర్కిల్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా వినయ్ ప్రవీణ్ స్నేహితులతో కలిసి కారులో అక్కడికి చేరుకుని బాధితురాలిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా ప్రస్తుతం వీరందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: