అవును. వరుస షాకులు టీడీపీను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల టీడీపీ పరిస్థితి మరి అద్వానంగా తయారయ్యింది. తమ సొంత వారే, వారికి ఎగ నామాలు పెట్టే పరిస్థితి దాపురించింది. ఆ కోవలోనే  నందమూరి బాలకృష్ణకు అత్యంత ఆప్తుడు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు రాజకీయ విశ్వసనీయ వర్గాల సమాచారం. అతనికి అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు అయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడనున్నారు. 

 

వైసీపీ అధినేత జగన్ సమక్షంలో అతను అధికార పార్టీలో చేరబోతున్నారని వినికిడి. ఈ రోజు మధ్యాహ్నమే ఆయన సీఎంను కలుస్తారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక బాబూరావు గారికి గత అసెంబ్లీ ఎన్నికల నుంచే టీడీపీ అధినేత చంద్రబాబుపై గుర్రుగా వున్నట్లు వినికిడి. ఎందుకంటే, దానికి కారణం లేకపోలేదు.. మొదటి నుండి, కనిగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అతన్ని, 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. 

 

ఇక కనిగిరి నుండి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో దీనిపై బాబూరావు ఒకింత అసహనం వ్యక్తం చేసారని అందరికి విదితమే. అయితే కనిగిరి సీటు మళ్లీ తనకే ఇవ్వాలని బాబూరావు టీడీపీకి అప్పట్లో స్పష్టం చేశారు. ఇక బాబు ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేసిన విషయం కూడా తెలిసినదే. ఇక అతను బాలయ్య ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.. ఈ విషయంలో చంద్రబాబు అప్పట్లో సెకండ్ ఒపీనియన్ యెంత మాత్రమూ తీసుకోలేదు.

 

ఇపుడే ఆ అంశమే బాలయ్య ప్రాణ స్నేహితుణ్ని అధికార పార్టీలోకి వెళ్లేలా చేస్తుంది అనేది కొందరు రాజకీయ నాయకుల విశ్లేషణ. ఇక అప్పట్లో దర్శి నుంచి పోటీ చేసిన బాబూరావు, వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసినదే. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో అయన అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పార్టీ మారతారంటూ రక రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరూ అతని నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: