సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాడు మహేష్ బాబు. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని... హాట్రిక్ సాధించి  దూసుకుపోతున్నాడు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు... తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నారు అనే విషయంపై మాత్రం టాలీవుడ్ లో ఇప్పటికి ఓ ప్రశ్న ఉంది. 

 

 

 కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న మహేష్ బాబు ఏ  దర్శకుడికి  ఛాన్స్ ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయి ఇప్పటికే రెండు నెలలు కావస్తోంది. కానీ ఇప్పటివరకు మహేష్ బాబు మాత్రం కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వాస్తవంగా అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక చివర్లో ఆ సినిమా కథ మహేష్ బాబుకు నచ్చక పోవడంతో ఆ సినిమా కాస్త పక్కన పెట్టేసాడు మహేష్. ఇక ఆ తర్వాత ఎంతో మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. గీతా గోవిందం సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు పరశురామ్ తో మహేష్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలు మధ్యలోనే ఆగిపోయాయి. 

 

 

ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు రాగా..  దీని గురించి ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు వెంకీ కుడుముల తో ఓ సినిమా చేయబోతున్నారు అంటున్నాడు. మరి ఈ వార్తల్లో  ఎంత నిజం ఎంత  ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో 2020 లో మహేష్ బాబు నుంచి సినిమా వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక దర్శకున్ని  సెలెక్ట్ చేసినప్పటికీ ఆ సినిమా అన్నీ పూర్తి చేసుకుని సెట్స్ పైకి  వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఇక మహేష్ లాంటి హీరోతో ఆరేడు నెలలు సినిమా పూర్తి చేయడం అంటే కాస్త కష్టమే. దీంతో 2020లో ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు అని సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎంతో నమ్మకంగా గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: