తాను తప్ప ఎవరు ఏమి చేసినా, తప్పే అన్నట్టుగా వ్యవహరిస్తూ తాను సీఎంగా ఉండకపోవడం దురదృష్టకరం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు వ్యవహార శైలి అనుమానాస్పదంగానే ఉంటూ వస్తోంది. పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు వ్యవహార శైలిపై అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేసే విషయంలోనూ చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, వయసు మర్చిపోయి మరి విమర్శలు చేస్తున్నాడు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 4 లక్షల మంది వలంటీర్లను నియమించింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియమించారు. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను ఇంటికి చేరే విధంగా, ఎవరు ఏ పనికోసం అయినా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అన్ని పనులను వాలంటీర్ల సహకారంతో చేసే విధంగా జగన్ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేసే క్రమంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు చంద్రబాబు మీద ఉన్న గౌరవం మరింత తగ్గించేశాయి.
అసలు వాలంటీర్లు అంటే, మూటలు మోసే పనివారు అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు. అసలు ఓ సందర్భంలో వలంటీర్ల వ్యవస్థను అవహేళన చేసే విధంగా... మగవారు ఇళ్ళల్లో లేని సమయంలో వాలంటీర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో వాలంటీర్లు వస్తే ప్రభుత్వానికి పెద్దదిక్కుగా మారారు. చంద్రబాబు చెప్పినట్లు గా ఆ మూటలు మోసే ఉద్యోగులే ఇప్పుడు ప్రజలకు బాగా పనికి వస్తున్నారు. రేషన్ దగ్గర నుంచి ఏ ప్రభుత్వ అ పథకంపై న ప్రజలకు చేరవేయడంలో నూ, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ వారికి కరోనా టెస్ట్ లు చేయించడం లోనూ వాలంటీర్లు ఇప్పుడు కీలకంగా మారారు.
ఏపీలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న వాలంటీర్ల వ్యవస్థను కేరళ, మిగతా రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా వాలంటీర్లు వ్యవస్థపై జగన్ ప్రభుత్వానికి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే మొన్నటి వరకు ఈ వ్యవస్థపై విమర్శలు చేసిన చంద్రబాబు, ప్రస్తుతం వారు అందిస్తున్న సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తుండడంతో మొన్నటి వరకు విమర్శలు చేసిన చంద్రబాబు ఇపుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.