ఒక యువతిని ఏడాది కాలంగా ప్రేమించి... ఇటీవలే పెళ్లి చేసుకున్న ఒక యువకుడు తన ప్రియమైన భార్యతో కాపురం చేయకుండా ఆమెను నానా ఇబ్బందులు పెడుతున్నాడు. పెళ్లయిన తర్వాత తన జీవితం స్వర్గమయం అవుతుందని భావించిన ఆమె ని అత్తారింటి వాళ్లే తరిమేస్తున్నారు. భర్త కూడా తల్లిదండ్రుల మాట విని తనతో మాట్లాడకపోవటంతో ఆమె గుండె ఒక్కసారిగా ముక్కలైపోయింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. 

పూర్తి వివరాలు తెలుసుకుంటే... సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం తోర్నాల గ్రామానికి చెందిన బింగి శ్రీనివాస రావు కూటిగల్ గ్రామానికి చెందిన బోయిని కవితా ని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ జిల్లాలో వీళ్లిద్దరు కలిసి తిరిగినా చోటే లేదు. ఇంత గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట జూన్ 20వ తేదీన కూటిగల్ గ్రామ శివారులో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ శ్రీనివాస తల్లిదండ్రులు తమ కొడుకు పెళ్లి చేసుకున్న కవితను ఇంట్లోకి రానివ్వడం లేదు. కనీసం భర్త కూడా ఆమెను ఇంట్లోకి తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేయకపోవడం స్థానిక ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది. 


ఏడాది కాలంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనకి ఆశ్రమం కల్పించకుండా, కాపురం చేయకుండా భావిస్తున్నాడు. ఎంత ఏడ్చినా శ్రీనివాస్ మాత్రం తన బాధను అర్థం చేసుకోకపోవడం తో ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించి అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా ఆమె ఫిర్యాదును సీరియస్ గా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. దాంతో ఏం చేయాలో తెలియని ఆ అభాగ్యురాలు తన భర్త ఇంటి ఎదుట మౌన దీక్షకు పూనుకుంది. ఆమె బాధని చూడలేని స్థానిక ప్రజలు తల్లిదండ్రులకు నచ్చచెప్పి శ్రీనివాసు ని బయటికి రప్పించి కవిత తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం పోలీసులు శ్రీనివాస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: