హైటెక్ యుగంలో హత్యల తీరు కూడా మారిపోతుంది. ఇంట్లో వాళ్ల కంటే ఎక్కువ టైమ్ ఫేస్ బుక్, ట్విట్టర్లోనే గడుపున్న ఈ కాలంలో ప్రతీది షేర్ చేసుకోవడం కామనైపోతుంది. అలాగని తన బావన హత్య చేయించి ఆ ఫోటోలను కూడా ఫేస్ బుక్ ద్వారా పంపాడు ఒక హైటెక్ నిందితుడు. కిరాయి హంతకులతో బేరం కుదుర్చుకుని బావను చంపించి ఆపై ఆ విషయాన్ని ఫేసుబుక్ లో షేర్ చేశాడు. మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్యకు గురయ్యాడు.
బల్కంపేటలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన చంద్రశేఖర్ చివరికి శవమై కనిపించాడు. అతన్ని కిడ్నాప్ చేసింది బావమరిది అనిల్ అని తెలుసుకున్న పోలీసులకు అతన్ని విచారించిన తర్వాత దిమ్మతిరిగే ఈ నిజాలు బయటపడ్డాయి. కిరాయి నిందితులతో హత్య చేయించిన అనిల్ ఆ ఫోటోలను ఫేస్బుక్ ద్వారా అనిల్ తన చెల్లికి పంపినట్టు పోలీసులు తెలిపారు. ప్రసుత్తం కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: