కోటి ఆశల మధ్య పెళ్లి చేసుకుంది.. అత్తవారింట్లో అడుగు పెట్టి ఎంతో అన్యోన్యంగా భర్తతో దాంపత్య జీవితాన్ని గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది... ఇక పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొన్ని రోజుల వ్యవధిలోనే భర్త అసలు నిజస్వరూపం బయటపడింది. మనసా వాచా కర్మణా తనని పెళ్లి చేసుకున్న భర్త చివరి వరకూ తనకు ఏ కష్టం రాకుండా చూసు కుంటాడు అనుకుంటే చివరికి భర్తే  కష్టం గా మారిపోయాడు. కొన్నాళ్లపాటు సాఫీగా ఉన్న భర్త ఆ తర్వాత అదనపు కట్నం వేధింపులు మొదలుపెట్టాడు. ఇక అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక కఠిన నిర్ణయం తీసుకుని  చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది యువతి.




 ఈ విషాదకర ఘటన అటు తల్లిదండ్రులకు తీరని కడుపు కోత  నింపింది. తమ కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టామని... ప్రస్తుతం తమ కూతురు ఎంతో సంతోషంగా ఉంది అని అనుకుంటున్న తరుణంలో ఈ విషాదకర వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రుల గ గుండె పగిలిపోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన వివాహిత కృష్ణప్రియ చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.




 ఇక రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న సమయంలో వివాహిత కృష్ణప్రియ 5 నెలల గర్భిణీ కావడం ప్రస్తుతం ఎంతో మందిని కలిచి వేసింది. అయితే అత్తింటి వారి వేధింపులు కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రస్తుతం కృష్ణప్రియ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో 5 లక్షల కట్నం తీసుకున్నారు అంటూ తెలిపిన కృష్ణప్రియ తల్లిదండ్రులు.. మరో 12 లక్షల అదనపు కట్నం ఇవ్వాలి అని తన కూతురుని వేధిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకొని ఉంటుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం భర్త అత్తామామలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: