భారత దేశ వ్యాప్తంగా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి తెలుసుకుంటే ఒక్కొక్కరికి కోపం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో ఒక ఆరేళ్ల బాలికపై కొంతమంది దుండగులు లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అభం శుభం తెలియని ఆ బాలికను అతి కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చి సాక్ష్యాధారాలను మాయం చేయాలని ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.


పూర్తి వివరాలు తెలుసుకుంటే పంజాబ్‌లోని హోషియార్‌పూర్ లో గుర్మీత్ సింగ్ సుర్జీత్ సింగ్ కలిసి ఆరేళ్ల బాలికపై కన్నేశారు. తమ కామ వాంఛలు తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూసి.. గురువారం రోజు ఎవరూ లేనప్పుడు అందరి కళ్ళు గప్పి ఆ బాలికను ఎత్తుకుపోయారు. ఆ తర్వాత బాలిక నోరు మూసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ బాలిక గొంతునులిమి చంపేశారు. ఆపై బాలిక మృతదేహాన్ని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. పోలీసుల చెప్పిన ప్రకారం బాలిక మృతదేహం తాండా లోని జలాల్పూర్ గ్రామం లో లభ్యమైంది.


ఈ కేసులో ఇద్దరు నిందితులు గుర్ప్రీత్ సింగ్, సుర్జిత్ సింగ్లను అరెస్టు చేసినట్లు.. ఇద్దరి మీద అత్యాచార, హత్య తదితర సంబంధిత కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడాన్ని ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కామాంధుల చేతిలో బలైన ఆరేళ్ల బాలిక అదే గ్రామంలో నివసిస్తున్న వలస కూలీ కుమార్తె. నిందితుడు గుర్మీత్ సింగ్ తన కుమార్తెను తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడని బాధితురాలి తండ్రి మీడియాకి చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. ఆ తర్వాత గుర్ప్రీత్, సుర్జీత్ ఇద్దరూ కలిసి బాలికను చంపి సాక్ష్యాధారాలను మాయం చేయడానికి శవాన్ని కాలబెట్టారని ఆయన అన్నారు.


ఇదిలా ఉండగా పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్ పర్సన్ తేజిందర్ కౌర్ ఈ కేసు గురించి పోలీసులను అడిగిమరీ తెలుసుకున్నారు. అక్టోబర్ 26 లోగా హోషియార్పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ నుండి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: