ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి తో జరిగిన గొడవ కొడుకు ప్రాణం పోయేంతవరకు వెళ్ళింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది.ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తండ్రి తో గొడవ పడిన కొడుకు తీవ్ర మనస్థాపం చెంది చివరికి ఎవరికీ తెలియకుండా చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. కొడుకు తీసుకున్న క్షణికావేశ నిర్ణయంతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం నిండిపోయింది. మెదక్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అహ్మద్ నగర్ లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో తలారి వెంకటేష్ అతని కొడుకు దుర్గేష్ మధ్య కుటుంబం విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు కలుగజేసుకుని ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇక తండ్రి మాటలతో మనస్థాపానికి గురైన దుర్గేష్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.