ఇదిలా ఉంటే తిరుపతి త్వరలో ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ని కూడా ప్రకటించేసింది.. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయినా పనబాక లక్ష్మి ఇక్కడ పోటీ చేస్తుండగా వైసీపీ, బీజేపీ పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు కన్ఫార్మ్ అయినా పేరులో అధికారికంగా ప్రకటించ లేదు. అన్ని పార్టీ లు ఇక్కడ గెలుపు ధీమా ను వ్యక్తం చేస్తుండగా బీజేపీ అయితే కాస్త దూకుడుగా ఆల్రెడీ గెలిచేశాం అని చెప్పడం వింతగా ఉంది. అయితే వైసీపీ సంగతి పక్కన పెడితే బీజేపీ తో పొత్తులో ఉన్న జనసేన ఇక్కడ పోటీ చేస్తుందా అనేది ఆసక్తి కరంగా మారింది.
జనసేన ఎంట్రీ 2014కు ముందు జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి ఇక్కడ పోటీ చేశాయి. టీడీపీ తిరుపతి టికెట్ను బీజేపీకి వదిలేసింది. దీంతో బీజేపీ తరఫున కారుమంచి జయరామ్ ఇక్కడ నుంచి బరిలో నిలిచారు. ఆయన 5,42,951 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఒంటరిగా బరిలోకి దిగిన.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. మొన్నటి ఎన్నికల్లో బొమ్మి శ్రీహరిరావు.. పోటీ చేసి కేవలం 16,125 ఓట్లు సాధించి.. డిపాజిట్ దక్కించుకోలేక అభాసుపాలయ్యారు.జనసేన అయితే పోటీకి దిగలేదు.. సో ఎటు చూసిన ఇక్కడ బీజేపీ కే కొంత బలం ఉందన్నది వాస్తవం..