గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా సొంతంగా ఎగురవేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 100పైగా సీట్లు గెలుచుకొని మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటామని అన్నారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో
మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టి టిఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ తయారు చేస్తున్నారని తెలిపారు.


 తెలంగాణ హైదరాబాద్ కు గుండెకాయ లాంటిదని చెప్పారు. ఎవరితో పొత్తు లేకుండా ఎక్స్ ఆఫీసీయో ఓట్లు కూడా అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పై బీజేపీ తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే గ్రేటర్ లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి కమలాకర్ తెలిపారు. మంత్రి వెంట మేయర్ సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: