ఈ మధ్య కాలంలో మనుషుల్లో మానవత్వం ఉన్న మనిషి కరువై  మృగాలు గా  మారి పోతున్న మనుషులు ఎక్కువ వుతున్నారు. ముఖ్యం గా బంధాలు బంధుత్వా లకు  విలువ ఇవ్వ కుండా దారుణం గా సొంత వారి ప్రాణాల ను సైతం కిరాతకం గా తీసేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇక రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సొంత వారి నుంచి కూడా రక్షణ కరువవుతోంది అని ప్రతిక్షణం భయ పడుతూ బతికే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటనే జరిగింది.


 వృద్ధాప్యంలో తమను చేరదీసి బాగా చూసుకుంటాడు అని ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకు ఏకంగా తల్లిదండ్రుల పాలిట యమకింకరుడు గా మారిపోయాడు.  తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడే తల్లిదండ్రులపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచిన కొడితే తమను చిత్రహింసలకు గురి చేస్తూ దాడికి పాల్పడడంతో బరువెక్కిన హృదయంతో ఆ తల్లిదండ్రులు బాధపడుతున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.



 కని పెంచిన తల్లిదండ్రులను బాగోగులు చూడకుండా ఏకంగా దారుణంగా కుమారుడు తల్లిదండ్రుల పై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం లో చోటుచేసుకుంది. వీర రాఘవయ్య అనే వ్యక్తి తన తల్లిదండ్రుల పై గొడ్డలి కర్రతో దాడి చేశాడు.  ఇక వృద్ధులైన తల్లిదండ్రులను ఎటు తప్పించుకోలేని దీన స్థితిలో ఉండటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనలో తల్లి  అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి నాగేశ్వరరావు తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే స్థానికులుతీవ్ర గాయాలపాలైన నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు.  తన భార్యతో గొడవలు కారణంగానే వీరరాఘవయ్య తల్లిదండ్రుల పై దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: