అందుకు తగ్గట్లే చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలకు దీనిపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని , ఎవరు కూడా నిర్లక్యంగా వ్యవహరించవద్దని, కేసులకు భయపడవద్దని నియోజకవర్గ టీడీపీ నేతలకు భరోసా ఇచ్చారు. ఈమేరకు తిరుపతి లో కార్యాచరణ ను కూడా ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రారంభించనున్నారు. సంక్రాంతి పండగ అనంతరం ఇక నేతలందరూ జనంలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
ఈ ఉప ఎన్నిక తో వైసీపీ కి బుద్ధి చెప్పాలనే సంకేతాలు ఇప్పటికే చంద్రబాబు నేతల్లోకి పంపగా, ఇక్కడి గెలుపు కు కృషి చేయాలనీ కొందరి నేతలకు బాధ్యతలు కూడా అప్పజెప్పారు. ఇక్కడ ఎన్నికల ప్రచారం కోసం దాదాపు 70 మంది సీనియర్ నేతలను ఉపయోగించుకోనున్నారట చంద్రబాబు. ఈ నెల17వ తేదీన తిరుపతిలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి పది రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో చంద్రబాబు ముందస్తు ప్రచారానికి దిగనున్నారన్న మాట..