ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య 15 వేలకు మించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి. ఇక అంతే కాకుండా ప్రస్తుతం అన్ లాక్ మార్గదర్శకాల లో భాగంగా అన్ని రకాల కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక దీనితో పాటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమై శరవేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మొదట్లో కరోనా వైరస్ విషయంలో వణికి పోయిన జనాలలో ప్రస్తుతం మాత్రం కరోనా అంటే భయం లేకుండా పోతుంది. కనీస జాగ్రత్తలు కూడా కనిపించడం లేదు.
మాస్క్ ధరించకపోవడం భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి చేస్తున్నారు.. తద్వారా కొన్ని చోట్ల మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ఇటీవలే ఒక గ్రామాన్ని కరోనా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న చేగుర్థి అనే గ్రామంలో ఇటీవల కరోనా వైరస్ కలకలం సృష్టించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో 33 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన దుర్గం కనకయ్య అనే వ్యక్తి పది రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందగా ఇక ఆయన అంత్యక్రియలకు గ్రామస్తులతో పాటు పక్క గ్రామానికి చెందిన వారు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఇక గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించగా ఏకంగా 33 కేసులు బయటపడడంతో గ్రామస్తులందరూ బేంబేలెత్తిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి