కొన్నిరోజల క్రితం ముకేశ్ అంబాని ఇంటి వద్ద ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబులు ఉన్న కారు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్‌ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ కు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ కేసు గురించి అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ కేసును ఏటీఎస్‌ కు అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ ప్రకటన చేశారు.

అసెంబ్లీలో అంతగా ఎందుకు చర్చ జరిగిందంటే..  అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్‌ గా భావిస్తున్న మన్‌సుఖ్‌ ఇవాళే మరణించాడు. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. అతడు కాలువలోకి దూకి మరణించిన ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.

మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అసలు ఆ కారు ఓనర్ మనుషుక్ కాదట. అతని పేరు శామ్ అట.. ఆయన కారు రిపేర్ కోసం మన్‌సుఖ్‌కు ఇచ్చాడట. కానీ.. రిపేర్ డబ్బు ఇవ్వలేదట. అందుకే ఆ డబ్బు కట్టి కారు తీసుకుపో అని మన్‌సుఖ్ అన్నాడట. అప్పటి నుంచి ఆ కారును మన్‌సుక్ వాడుతున్నాడు. ఇప్పుడు మన్‌సుక్‌ మృతితో ఈ కేసుపై అనుమానాలు పెరిగాయి.

ఈ అంశంపైనే అసెంబ్లీలో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మేం ముందునుంచీ చెబుతున్నామని.. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద కథే ఉండొచ్చని ఫడ్నవీస్ అంటున్నారు. తాము చెప్పినప్పుడే పోలీసులు దృష్టి పెట్టి ఉంటే మన్‌సుఖ్ మరణించేవాడు కాదని.. విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: