అసెంబ్లీలో అంతగా ఎందుకు చర్చ జరిగిందంటే.. అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ గా భావిస్తున్న మన్సుఖ్ ఇవాళే మరణించాడు. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. అతడు కాలువలోకి దూకి మరణించిన ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అసలు ఆ కారు ఓనర్ మనుషుక్ కాదట. అతని పేరు శామ్ అట.. ఆయన కారు రిపేర్ కోసం మన్సుఖ్కు ఇచ్చాడట. కానీ.. రిపేర్ డబ్బు ఇవ్వలేదట. అందుకే ఆ డబ్బు కట్టి కారు తీసుకుపో అని మన్సుఖ్ అన్నాడట. అప్పటి నుంచి ఆ కారును మన్సుక్ వాడుతున్నాడు. ఇప్పుడు మన్సుక్ మృతితో ఈ కేసుపై అనుమానాలు పెరిగాయి.
ఈ అంశంపైనే అసెంబ్లీలో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మేం ముందునుంచీ చెబుతున్నామని.. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద కథే ఉండొచ్చని ఫడ్నవీస్ అంటున్నారు. తాము చెప్పినప్పుడే పోలీసులు దృష్టి పెట్టి ఉంటే మన్సుఖ్ మరణించేవాడు కాదని.. విమర్శించారు.