ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత ఎన్ని రోజులకు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి అన్న దానిపై చాలామందికి క్లారిటీ లేదు.అయితే ఇటీవలే ఈ విషయం పై నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు రెండు నెలల వరకు వ్యాక్సిన్ తీసుకోవద్దు అంటూ నిపుణులు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ప్యానల్ కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారు మొదటి డోస్ రెండవ డోస్ కి మధ్య సమయం 12 నుంచి 16 వారాలు ఉంచాలని సూచించారు.
అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవచ్చో నిర్ణయించుకోవచ్చని ఇటీవలే నిపుణుల కమిటీ తెలిపింది. మహిళలు ప్రసవం తర్వాత కూడా పిల్లలకు పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటూ నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఒక వేళ కరోనా పాజిటివ్ వస్తే ఇక వైరస్ నుంచి కోలుకున్నాక 4 నుంచి 8 వారాల వరకు వేచి ఉండాలి అంటూ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక ప్లాస్మా చికిత్స ద్వారా వైరస్ నుంచి కోలుకున్న బాధితులు మూడు నెలల వరకు టీక వేసుకోవడాన్ని వాయిదా వేసుకోవాలి అని సూచించింది అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా 4 నుంచి 8 వారాల వరకు రెండవ డోస్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు నిపుణులు.