ఓవైపు దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే ఈ మహమ్మారి వైరస్ స్పీడ్ కి కళ్లెం వేసేందుకు అటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా జరుపుతున్నాయి.  వాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలను పెంచి ఆ తర్వాత వైరస్ను తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి.  ఈ క్రమంలోనే వివిధ దశలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి ప్రభుత్వాలు.  అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడుతూ ఉన్నారు.  ఇలాంటి నేపథ్యంలో మళ్లీ అందరిలో ఎన్నో అపోహలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.



 ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత ఎన్ని రోజులకు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి అన్న దానిపై చాలామందికి క్లారిటీ లేదు.అయితే ఇటీవలే ఈ విషయం పై నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు రెండు నెలల వరకు వ్యాక్సిన్ తీసుకోవద్దు అంటూ నిపుణులు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ప్యానల్ కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారు మొదటి డోస్ రెండవ డోస్ కి మధ్య సమయం 12 నుంచి 16 వారాలు ఉంచాలని  సూచించారు.



 అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవచ్చో నిర్ణయించుకోవచ్చని  ఇటీవలే నిపుణుల కమిటీ తెలిపింది. మహిళలు ప్రసవం తర్వాత కూడా పిల్లలకు పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్  తీసుకోవచ్చు అంటూ నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఒక వేళ కరోనా పాజిటివ్ వస్తే ఇక వైరస్ నుంచి కోలుకున్నాక 4 నుంచి 8 వారాల వరకు వేచి ఉండాలి అంటూ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక ప్లాస్మా చికిత్స ద్వారా వైరస్ నుంచి కోలుకున్న బాధితులు మూడు నెలల వరకు టీక వేసుకోవడాన్ని వాయిదా వేసుకోవాలి అని సూచించింది అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా 4 నుంచి 8 వారాల వరకు రెండవ డోస్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: