దేశంలో కరోనా ఉధృతి చాలా దారుణంగా పెరిగిపోతుంది. రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. చాప కింద నీరు లాగా కరోనా మహమ్మారి వ్యాపిస్తుంది.కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం  కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. రెమిడిస్‌విర్‌ను అత్యవసర వినియోగానికి అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఈ టీకాల విషయంలో పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ లో పెద్ద దోపిడీ జరుగుతుంది. కరోనా పేషెంట్స్ కొంచెం ధనవంతులు అని తెలియగానే మన డాక్టర్ దోపిడీ దారులు వారిని తెగ దోపిడీ చేస్తున్నారు. సాదారణంగా కరోనా వచ్చి పెద్ద ప్రమాదం లేనివారికి సాధారణ రెమిడీస్విర్ ఇస్తే సరిపోతుంది. కాని మన డాక్టర్ బాబులు ఠాగూర్ సినిమాలో లాగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజల ప్రాణాల బలహీనతమీద దెబ్బ కొట్టి డబ్బులు గుంజుకుంటున్నారు.ఇక కరోనా వ్యాక్సిన్ కొరత లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.అయినా కాని మన డాక్టర్ బాబులు డబ్బుల దోపిడీలు చేస్తున్నారు.


కరోనా వ్యాక్సిన్లను వృథా చేయొద్దని, బ్లాక్ మార్కెట్లకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని  కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కొందరు రెమిడిసివర్ ఇంజెక్షన్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారు.ఈ ఇంజక్షన్ లు సాధారణంగా 2 నుంచి 3 వేలు లోపు అమ్ముడుపోతాయి. కాని డాక్టర్లు పేషెంట్స్ కి నానా సాకులు చెప్పి 20,30 వేలు రేటు చెప్పి దోపిడీ చేస్తున్నారు.ఇక ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు లక్షల్లోకి పోయింది. ఇక కొంచెం ఆర్ధిక స్థోమత ఎక్కువుగా వున్న వారి దగ్గర డాక్టర్ బాబుల దోపిడీ మాములుగా లేదనే చెప్పాలి.


ఇది పెద్ద పెద్ద హాస్పిటల్ లో జరుగుతుంది.ఇక డాక్టర్ దోపిడీ దారులు ముఖ్యంగా రెండు ఇంజక్షన్ లను సిఫారసు చేస్తున్నారు. ఒకటి tocilizumab కాగా రెండోది bevacizumab. మాములుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరని బట్టి చూస్తే ఇవి 45000/- రూపాయలు ఉంటాయి. కాని డాక్టర్లు నానా సాకులు చెప్పి వీటిని 5-7 లక్షలకు అమ్మి దోపిడీ చేస్తున్నారు. చేశారు కూడా. అయితే ఈ ఇంజక్షన్ల వల్ల కొంతమంది బ్రతికారు, కొంతమంది చనిపోయారు కాని ఈ డాక్టర్ల దోపిడీ మాత్రం చావడం లేదు. ఈ రకంగా మన దేశ డాక్టర్ బాబులు ప్రజలను వారి ప్రాణాలతో ఆడుకుంటూ నిలువుదోపిడి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: