ఇటీవల జగన్ చేసిన ఒక ప్రకటనతో ఇప్పుడు ఎమ్మెల్యే లు అందరిలోనూ వణుకు మొదలైంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ పలకరించనున్నారు. ఈ రచ్చబండకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా చెప్పకుండా వెళ్లనున్నారు. ఈ ప్రకటనతో కొందరు ఎమ్మెల్యే లు అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పడుతుందో అన్న ఆందోళనతో జగన్ ఇప్పటి నుండి ప్రజల ఆదరణ లేని నియోజకవర్గాలను కనుగొని అక్కడ బలోపేతం చేసుకునే దిశగా ఈ రచ్చబండను ఉపయోగించుకోనున్నారు.
మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి జగన్ పునరాలోచించుకోవలసి ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. జగన్ చేసే ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుంది, ఎన్నికల్లో ఈ ప్రయోగం ఫలిస్తుందా అనేది చూడాలి. ఈ పర్యటన మాత్రం రాబోయే ఎన్నికలలో చాలా కీలకం కానుంది. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఓటర్లు జగన్ కు ఈ సారి షాక్ ఇవ్వనున్నారా లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.