అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ విషయంలో మరోసారి పొరపాట్లు చేస్తే పార్టీ ఇక ఇప్పట్లో కోలు కోలేదన్న విషయాన్ని గ్రహించి నట్టే ఉన్నారు. అందుకే పార్టీ ఇన్ చార్జ్ ల ఎంపికతో పాటు ఇతర పదవుల్లో ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. వచ్చే ఎన్నికలు మరో రెండున్న ర సంవత్సరాలు ఉన్నా కూడా వాటిని ఇప్పటి నుంచే భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను పెడితే వారు రెండున్నరేళ్లుగా ప్రజల్లోనే ఉంటారని.. అది పార్టీకి ప్లస్ అవుతుందని బాబు భావిస్తున్నారు.
ఈ రెండు న్నర సంవత్సరా లలో ఎవరు అయితే ప్రజల్లో ఉండి ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తారో ? వారికే సీట్లు ఇవ్వాలని కూడా బాబు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎప్పటి కప్పుడు ఏ నియోజకవర్గాల్లో ఎవరి పని తీరు ఎలా ఉంటోంది ? అనే దానిపై నివేదికలు తెప్పించు కుంటున్నారు. వీటి ఆధారంగానే బాబు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లే కేటాయిస్తారని తెలుస్తోంది. అందుకే బాబులో ఈ కొత్త మార్పు ఇప్పుడు తెలుగు తమ్మళ్లలో మాంచి జోష్ నింపుతోంది.