అయితే ఇపుడు అలాంటి ఆరోపణలు మరియు కామెంట్ లపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ కి విచ్చేసిన ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆ ఆరోపణలను ఖండించారు. ఇవేమీ కొత్తగా వచ్చినవి కాదని, గతంలో ఉన్న పలు ప్రభుత్వాలు సైతం ఇదే పద్ధతిని పాటించిన విధానం మరిచిపోయారా ఏంటి ? అప్పుడు అంతా సైలెంట్ గా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు గొంతు లేస్తోంది అంటూ స్ట్రాంగ్ గా అడిగారు. అయినా కరెంట్ బిల్లు కట్టక పోతే కరెంట్ తీసేయడం అంత తప్పు అనడానికి లేదు కదా?
ప్రభుత్వం సజావుగా పాలన కొనసాగించాలంటే కొన్ని చట్టాలకు కొన్ని విధి విధానాలకు కట్టుబడి ఉండాలి. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా చేసుకుంటూ పోతోంది. అలాగని కరెంటు బిల్లులు కట్టకపోతే నోటీసులు ఇవ్వడం వరకు సరే... కానీ ఇంటికి తాళాలు వేయడం మాత్రం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా అభివృద్ది చేయాలి అంటూ ప్రశ్నలు కురిపించారు మంత్రి బొత్స .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి