ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తన 51వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నారు.. 1972 డిసెంబర్ 21న జన్మించారు.. ఆంధ్రప్రదేశ్కు 17వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితాన్ని మొదట ప్రారంభించారు..2009 లో హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి మరణించిన తర్వాత ఓదార్పు యాత్రతో ప్రారంభించి చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిరించి బయటికి వచ్చి సొంతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్మించారు.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 67 సీట్లను గెలుచుకోగా ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలకు 151యొక్క స్థానాలు గెలవడంతో భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు.. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మ దంపతులకు జన్మించారు.. ఈయన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. హైదరాబాద్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ తో బయటికి వచ్చిన సీఎం జగన్ భారతీని 1996 ఆగస్టు 28న వివాహం చేసుకున్నారు.



వీరికి ఇద్దరు కుమార్తెలు.. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 నుంచి 2009 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి. 2019లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు.. ఏపీ ప్రజలకు జగనన్న అమ్మబడి నవరత్నాలు అంటే అనేక సంక్షేమ పథకాలతో మంచి క్రేజీని సంపాదించుకున్నారు. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సైతం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD