పొత్తుల కోసం ఢిల్లీకి వెళ్లనున్న  పవన్ కళ్యాణ్ ?


ఆంధ్రప్రదేశ్ లో న్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకంపై ఓ వైపు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతూనే..మరోవైపు జనసేన పార్టీ తరపున నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్న విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు అనధికారికంగా ఇన్‌ఛార్జ్‌లను పవన్ ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాకకు సుందరపు సతీష్‌, పెందుర్తిలో పంచకర్ల రమేష్‌ ఇంకా అలాగే యలమంచిలిలో సుందరపు విజయ్‌ కుమార్‌లను నియమించారు. అధికారికంగా అభ్యర్థులని కాకుండా 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను కూడా పవన్ ప్రకటించారు.గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఇక అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావం చూపింది. 


ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి ఇంకా యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటున్నట్టు వస్తున్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారనే కారణంతో తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు, అలాగే రాజానగరంలో పోటీ చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.అయితే పొత్తులు కన్ఫర్మ్ కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌ల ప్రకటనను జనసేన అధినేత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. నిన్న విశాఖలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. నేడు రాజమండ్రిలో కూడా పర్యటించనున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా జనసేన అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు. ఇక ఈనెల 22న ఢిల్లీ వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌.. బీజేపీ పొత్తులతో వారితో చర్చింనున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తరువాత పొత్తులతో పాటు ఏయే సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందనే అంశంలో క్లారిటీ రావొచ్చని జనసేన నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: